తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రీలీల

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టిటిడి ఆలయ అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

➡️