అమరావతి : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు తాడేపల్లిలో సిఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరనున్నారు. తాను తన కుమారుడు గిరితోపాటు వైసిపిలో చేరనున్నానని ముద్రగడ ముందుగానే ప్రకటించారు. భారీ ర్యాలీగా బయలుదేరి ఇప్పటికే కిర్లంపూడి నుండి తాడేపల్లికి చేరుకున్నారు. కాసేపట్లో కుమారుడితో కలిసి ముద్రగడ పద్మనాభం వైసిపి కండువాను కప్పుకోనున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/mudragada.jpg)