ప్రజాశక్తి కథనాలు – స్పందించిన అధికారులు

అద్దేపల్లి (బాపట్ల) : మండల కేంద్రం భట్టిప్రోలు అద్దేపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి సంబంధించిన గోడౌన్‌ స్థలంనకు ఎట్టకేలకు సొసైటీ అధికారులు స్పందించి ఫినిషింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ గోడౌన్‌ ను కొందరు గ్రామస్తులు ఆక్రమించుకొని, అక్రమంగా స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించగా దానిని మొదటి నుండి ప్రజాశక్తి అడ్డుకునే విధంగా కథనాలు వెలువరించింది. వారిని ఆసరాగా తీసుకొని కొందరు గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. దీంతో లోకయుక్త కోర్టు పరిశీలన జరిపి ఈ స్థలము సొసైటీ కి సంబంధించినదని, దీనిని ఏ ఒక్కరు అన్యాక్రాంతం చేసినా చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఆ మేరకు సంబంధిత సొసైటీ అధికారులకు ఈ స్థలాన్ని తక్షణమే ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని పరిశీలనకు వచ్చిన అధికారి సూచించారు. సొసైటీ అధికారులు గురువారం ఫినిషింగ్‌ ఏర్పాటు చేయడం పట్ల పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

➡️