పొదలి (ప్రకాశం) : పొదిలి నిర్మలా కాన్వెంట్ విద్యార్థినికి ఆల్ ఇండియా మ్యాథ్స్ లో 4వ ర్యాంక్ వచ్చింది. రసూల్ కుమార్తె ఎస్.కె. సబీహా పొదిలిలోని స్థానిక నిర్మలా కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఐదవ తరగతి చదువుతుంది. సబీహా ఆల్ ఇండియా మాథ్స్ అండ్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో 4వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం, కరస్పాండెంట్ సిస్టర్ రూబీ, ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ రాణి, ఉపాధ్యాయులు కలిసి అభినందించారు. విద్యార్థిని ప్రతిభకు కారణమైన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు యం.సుధీర్ ను అభినందించారు.