పాలకొల్లు టిడ్కో గృహాల వద్ద ప్రొటోకాల్ వివాదం

protocal dispute at palakollu
  • ఎమ్మెల్యే నిమ్మల బైఠాయింపు‌‌

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద టిడ్కో గృహాల పంపిణీ వద్ద శనివారం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ప్రొటోకాల్ పాటించలేదని వివాదం నెలకొంది. ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరిగింది. అయితే ఎమ్మెల్యేకు కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని ఆయన నిరసన వ్యక్తం చేసి సభ ముందు బైఠాయించారు. దీంతో నామమాత్రంగా పెద్ద తాళం ఇచ్చి ప్రసాద్ రాజు సభ నుంచి వెళ్ళిపోయారు. అయితే టిడిపి, వైసిపి నేతలు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిన పోలీసులు సామరస్యంగా ఉండి ఘర్షణ లేకుండా చేసారు. ఇరు పార్టీల వాగ్వివాదంతో పట్టాలు సచివాలయంల ద్వారా పంపిణీ చేస్తామని నేతలు ప్రకటించారు. ఇంకా సభలో వైసిపి ఇన్చార్జి గుడాల గోపి, యడ్ల తాతాజీ, గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. గతంలో టిడ్కో గృహాల వద్ద ఎమ్మెల్యేను గెంటి వేసారు. అయితే ఈసారి పోలీస్ బలగాలు ఉన్న ఎమ్మెల్యే మీద చేయి వేయకపోవడం కొసమెరుపు.

➡️