తెలంగాణ : ” కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట ” అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభ ఆవరణలో నిర్వహించిన మీడియాతో చిట్చాట్ లో.. కెటిఆర్ మాట్లాడుతూ … సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దులపై చర్చ జరగలేదన్నారు. తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు. ప్రతి ఏడాది కాగ్ నివేదికలు ఇస్తోందన్నారు. ఆడిట్ లెక్కలు తీస్తున్నారని చెప్పారు. అలాంటప్పుడు లెక్కలు వేసుకుని హామీలు ఇస్తారా ? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి వారికి అప్పగించారని ఇక కాంగ్రెస్ నేతలు చెబుతారని… కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.