ఎన్నికల శంఖారావం పూరిస్తున్నా : షర్మిల

అమరావతి : ఎపిలో ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ … ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు షర్మిల శుక్రవారం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ”దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను” అంటూ షర్మిల ట్వీట్‌ చేశారు. అంతేకాదు, తల్లి విజయమ్మతో కలిసి ఉన్న ఫొటోలను కూడా పంచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలే ఎపిలో తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది.

➡️