ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేంద్రంలోని మతోన్మాద బిజెపిని, దాన్ని బలపరిచే టిడిపి, జనసేన పార్టీలను, నిరంకుశ వైసిపిని ఓడించాలని, లౌకికవాదాన్ని బలపరిచే ఇండియా వేదికను గెలిపించాలని కోరుతూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. 8వ తేదీ ఉదయం 9:30 గంటలకు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో దావాజీగూడెం పామర్తినగర్ ఎస్విఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే సభలో పాల్గననున్నారు. సాయంత్రం 5 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణుడిగుడి సెంటర్లో జరిగే సభలో మాట్లాడతారు. 9వ తేదీ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం పోలీసు గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గంటారు. 10వ తేదీన ఉదయం పది గంటలకు గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సభలో మాట్లాడతారు. సాయంత్రం ఆరు గంటలకు ఎన్టిఆర్ జిల్లా విజయవాడ జింఖానా గ్రౌండ్లో జరిగే సభలో పాల్గొంటారు.