ప్రజాశక్తి-అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.