రాయలసీమ ‘లిఫ్ట్‌’ పనులు ఆపండి

Dec 21,2023 09:48 #Irrigation Projects, #Rayalaseema
stop rayalaseema lift works

కెఆర్‌ఎంబికి తెలంగాణ లేఖ

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని, దీనిని వెంటనే ఆపాలని కోరుతూ కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ బుధవారం లేఖ రాశారు. ఈ మేరకు ఎన్‌జిటి ఉత్తర్వులను కూడా ఈ లేఖకు జత చేశారు. గత రెండేళ్లుగా ఈ పనులు జరుగుతున్నాయని, రాత్రి పూట వీటిని చేపడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఈ విషయం బోర్డు దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టుకు సిడబ్ల్యుసి, కేంద్ర జలశక్తి శాఖ అనుమతి లేదని ఈ లేఖలో పేర్కొన్నారు.

➡️