ప్రజాశక్తి – నాదెండ్ల (పల్నాడు జిల్లా) : గుండెపోటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని సాతులూరులో బుధవారం జరిగింది. మృతుని అమ్మమ్మ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మేకపోతుల దిలీప్కుమార్ (14) స్థానిక జెడ్పి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. తల్లి ఆరేళ్ల క్రితం చనిపోవడంతో అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. చిన్నతన్నంలోనే గుండె సంబంధిత వ్యాధికి గురైన దిలీప్కుమార్కు రెండు ప్రత్యేక పరికరాలను వైద్యులు అమర్చారు. ఉగాది సందర్భంగా గ్రామంలోని రెడ్డి పేరంటాలమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన జంపింగ్ ప్యాడ్పై ఆడుకున్న కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా దిలీప్ కుప్పకూలిపోయారు. గమనించిన అమ్మమ్మ వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో విద్యార్థి మరణించినట్లు తెలిపారు.