ఢిల్లీ : లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను మరికాసేపట్లో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా ఇవాళ్టీతో కవిత ఈడీ కస్టడీ ముగిసింది. అయితే కవిత ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ రిపోర్ట్ ఇవ్వాలని ఆమె తరఫు లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈడీ కవితను మరో 3 రోజులు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది.