-సిపిఎం, సిపిఐ ప్రకటన
ప్రజాశక్తి – అమరావతి :తెనాలి శాసనసభ నియోజకవర్గంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి శవల గోపాల్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. గోపాల్ గెలుపుకోసం సిపిఎం, సిపిఐ శ్రేణులు కృషి చేస్తాయని పేర్కొన్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ గోపాల్కు ఓట్లేసి గెలిపించాలని కోరారు.