ప్రజాశక్తి-ఏలూరుప్రతినిధి
ఏలూరు జిల్లా నారాయణపురంలో విడిది చేసిన సిఎం వైఎస్ జగన్ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన టిడిపి, జనసేన నాయకులు వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కీలక నేత (2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి) చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు, తెలుగు యువత పిడుగురాళ్ల మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావులు వైసిపిలో చేరారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి పి.అనిల్ కుమార్యాదవ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బి.వి.రావు,జనసేన జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవ సంఘం నాయకుడు పచ్చిగోళ్ల రామకృష్ణ వైసిపిలో చేరారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తదితరులు పాల్గన్నారు. సిఎంకు జనసేన, టిడిపి నేతలను వైసిపి నాయకులు పరిచయం చేయగా సిఎం వైసిపి కండువాలు కప్పి ఆహ్వానించారు.