రాయదుర్గం : రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఐటిసి కోహినూర్ హోటల్ పక్కన ఉన్న దాసరి కుమారి ఫుడ్ స్టాల్ ముందు శనివారం నిరుద్యోగులు నిరసనకు దిగారు. ఇటీవల కుమారి ఫుడ్ స్టాల్ విషయంలో సిఎం రేవంత్ స్పందించారనీ… తామంతా ఉద్యోగం లేక ఇబ్బందిపడుతున్నామని, తమ గురించి రేవంత్రెడ్డికి చెప్పి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో కుమారి, నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె కుటుంబసభ్యులు కల్పించుకుని తమను రోడ్డున పడేయొద్దని వేడుకున్నారు. ”నిరుద్యోగులమైన మా గురించి కూడా సిఎంకు ఒక మాట చెప్పు అక్కా” అంటూ ఆమెతో నిరుద్యోగులు అన్నారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ ఆగింది. నిరసనకారులు, కుమారి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యింది.