కేశవగిరి (హైదరాబాద్) : ట్రావెల్స్ కారు డ్రైవింగ్ చేస్తూనే గుండెపోటుతో డ్రైవర్ మరణించిన ఘటన శుక్రవారం ఉదయం చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై వి.శ్రీనివాస్ వివరాల మేరకు… బడంగ్పేట్కు చెందిన జె.ధనుంజరు (41) ఓ ప్రైవేటు ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య నందినిజై, కూతురు ఝాన్సీ (10), కొడుకు సుదాన్ష్ (8) ఉన్నారు. ఈరోజు ఉదయమే ట్రావెల్స్కు వచ్చిన ధనుంజరు యజమాని కారు తీసుకొని పాతబస్తీ లాల్దర్వాజా ప్రాంతంలో ఓ ప్రయాణికుడిని పికప్ చేసుకునేందుకు బయలుదేరాడు. నల్లవాగు సమీపంలోని ధోబీఘాట్ వద్ద కందికల్ ఆర్వోబీ ఎక్కే ముందే ధనుంజరుకు గుండెపోటు వచ్చింది. తక్కువ వేగంతో ఉన్న కారును అదుపు చేసినా అది పక్కనే డివైడర్పైకి ఎక్కి ఆగిపోయింది. ఆయన సీటులోనే తుదిశ్వాస విడిచారు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.గురునాథ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. చలాకీగా ఇంటి నుంచి వెళ్లిన ధనుంజరు మరణవార్తతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.