బెల్లంకొండ (పల్నాడు) : సెల్ఫోన్ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం … కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి అయిదో తరగతి చదువుతోంది. గత శనివారం ఇంట్లో సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పెద్ద శబ్దంతో సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక కుడిచేతి రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. పొట్ట భాగంలో గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను గుంటూరు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం బాలిక అక్కడ చికిత్స పొందుతోంది.