లారీ డ్రైవర్ దారుణ హత్య

The lorry driver was brutally murdered

ప్రజాశక్తి-నకరికల్లు : గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని కత్తితో పొడిచి చంపిన సంఘటన చల్లగుండ్ల వద్ద గల దివ్య హోటల్ లో రాత్రి సమయంలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రూరల్ సిఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన పెరవలి మణికంఠ (27సం.) ఇతను లారీ డ్రైవర్ గా పనిచేస్తూ మాచర్లలో నివాసం ఉంటున్నాడు. బుధవారం విప్పర్ల గ్రామానికి వచ్చిన మణికంఠ సాయంత్రం సమయంలో ఇంటి వద్ద ఉన్న తండ్రితో మాట్లాడాడు. అనంతరం మద్యం సేవించడానికి రాత్రి 9:30 గంటల సమయంలోచల్లగుండ్ల వద్ద ఉన్న దివ్య హోటల్ ప్రక్కన గల గదిలోకూర్చొని ఉండగా గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చి అతనితో గొడవపడి కత్తితో పొడిచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతిని ఒంటిపై సుమారు ఐదు కత్తిపోట్లు ఉన్నట్టు తెలిపారు. మృతుడు మణికంఠ పై రొంపిచర్ల, గుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం, గంజాయి మర్డర్ కేసులు ఉన్నాయన్నారు. రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో A1 రౌడీ షీట్ ఉందని సీఐ రాంబాబు తెలిపారు. మృతుని తండ్రి పెరవలి బాబును పోలీస్ లు విచారించారు. బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

➡️