రాజధాని ఖరారైతేనే రిజర్వుబాంకు ప్రాంతీయ కార్యాలయం

Apr 10,2024 22:55 #andrapradesh, #Rajadhani, #RBI

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో
రాష్ట్రంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ మేనేజరు సుమేడ్‌ జువాడే స్పష్టం చేశారు. తాను రాసిన లేఖకు ఆర్‌బిఐ ఈ మేరకు సమాధానం ఇచ్చినట్లు అఖిల భారత పంచాయితీ పరిషత్‌ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతిలో రిజర్వ్‌్‌ బ్యాంక్‌ కార్యాలయం ప్రారంభించాలని ప్రధాని నరేంద్రమోడీకి ఇటీవల జాస్తి వీరాంజనేయులు లేఖ రాశారు. ప్రధాని కార్యాలయం నుండి వచ్చిన సూచన మేరకు అదే లేఖను ఆయన ఆర్‌బిఐకి కూడా పంపారు. ఆ లేఖకు బుధవారం ఆర్‌బిఐ నుండి సమాధానం అందింది. రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయలేదని, చేసిన తరువాతే ఆర్‌బిఐ కార్యాలయం ఏర్పాటుచేస్తామని లేఖలో పేర్కొన్నారు.

➡️