సిపిఎం నేత కృష్ణమూర్తికి నివాళులు

ప్రజాశక్తి-బాపట్ల : ఆదివారం మృతి చెందిన సిపిఎం సీనియర్‌ నాయకులు, విశ్రాంత వైద్యులు వల్లభనేని కృష్ణమూర్తి (81) అంత్యక్రియలు విజయవాడలోని ఆయన కుమారుడి నివాసం వద్ద ప్రారంభం అయ్యాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కృష్ణమూర్తి మృతికి సంతాపం తెలిపి, ఆయన మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణమూర్తి ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని ఆయన కుమారుడి నివాసంలో తుదిశ్వాస విడిచారు.  ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. జోలపాలెం నివేశనా స్థలాల పంపిణీ, రాగిలంక భూముల పోరాటంలో కీలక పాత్ర పోషించారు. రావిలంక భూముల పోరాట కమిటీలో సభ్యునిగా ఉన్నారు. ఎంతో నిబద్ధత కలిగిన నాయకులుగా ఉన్న కృష్ణమూర్తి కొల్లూరు, తదితర ప్రాంతాల్లో వైద్యులుగా కూడా గుర్తింపు పొందారు. కరోనా సమయంలో బాధితులకు వైద్య చికిత్స అందించి.. ఎనలేని కృషి చేశారు.

➡️