మరో ఇద్దరు మృతి..

May 5,2024 00:19 #2 death, #ap government, #Pension
  • ఆగని పింఛను మరణాలు

ప్రజాశక్తి – యంత్రాంగం : పింఛను కోసం బ్యాంకులకు వచ్చి, వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్న సంఘటనలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం ఇద్దరు మరణించారు. తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం కోటమంగాపురం గ్రామానికి చెందిన ఎం. కన్నెమ్మ (70) తన పింఛన్‌ సొమ్ము కోసం రెండు రోజులుగా స్వగ్రామం నుంచి పిచ్చాటూరుకు వెళ్లి వచ్చేవారు. మండుటెండలో తిరగడంతో వడదెబ్బకు గురై మరణించారు. బాపట్ల జిల్లా మార్టూరులోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీకి చెందిన సయ్యద్‌ గాలీబ్‌ (60) తన పింఛను సొమ్మును మార్టూరులోని బ్యాంకు నుంచి తీసుకుని రెండు కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి సైకిల్‌ మీద వెళ్లారు. వడదెబ్బ తగలడంతో తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. బ్యాంకుల వద్ద పింఛనుదారుల ఇబ్బదులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి.

➡️