గుండెపోటుతో ‘ఉపాధి’ కూలీ మృతి

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పర గూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీ గుండెపోటుతో మృతి చెందారు. ఉపాధి పనికి సోమవారం ఉదయం పనిచేస్తుండగా మర్లపూడి సులోమాన్ గుండెపోటుకు గురయ్యారు. దీనితో అపస్మారక స్థితిలోకి వెళుతుండగా చికిత్సకోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అకస్మాత్తుగా మృతి చెందారు. మర్లపూడి సలోమాన్ (60) మృతితో ఉపాధి హామీ పథకం కూలీల సంఘం నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కుటుంబాన్ని వెంటాడిన మరణాలు 

సులేమాన్ భార్య గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అనంతరం మరో రెండేళ్లలో కొడుకు కరోనాతో మృతి చెందాడు. దీంతో సులేమాన్ మనవళ్ళను, కోడలిని పెంచుతూ ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా వ్యవహరించాడు. ఇతని మృతితో కోడలు చిన్న పిల్లలు అనాధలు అయ్యారు.

➡️