ప్రజాశక్తి-విజయవాడ : తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమితో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో తెలుగుదేశం, జనసేనల పొత్తు ప్రజలకు వెన్నుపోటుగా అభివర్ణించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బిజెపితో కలిసి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/vsr-on-bjp-jsp-tdp-alliance.jpg)