తెలంగాణ : తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంకలను రేవంత్ ఆహ్వానించారు. అనంతరం రాహుల్ గాంధీ ఎక్స్లో ఆ ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ” తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం ” అని రాహుల్ పేర్కొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/rahul-gandhi-1.jpg)