త్వరలో ఢిల్లీకి పయనం – చంద్రబాబు, పవన్‌ భేటీ

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నరపాటు ఇద్దరూ చర్చించారు. టిడిపి-జనసేన కూటమిలో బిజెపి చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్‌ ఢిల్లీకి వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాలపై నేతలిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది.

➡️