ఘనంగా వైసిపి ఆవిర్భావ ఉత్సవాలు

-మళ్లీ ప్రమాణస్వీకార కౌంట్‌డౌన్‌ బోర్డు ఏర్పాటు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, ఎంపి నందిగం సురేష్‌ తదితరులు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మాట్లాడుతూ . ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. కార్యాలయం వద్ద జగన్‌ అనే నేను పేరుతో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సిఎంగా ప్రమాణస్వీకారం చేసే రోజును తెలియచేస్తూ కౌంట్‌ డౌన్‌ డిజిటల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీగా వైసిపిని ముఖ్యమంత్రి జగన్‌ అభివర్ణించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

➡️