ఢిల్లీ : వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీని కలవనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలోనే తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయనున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలకు ఏఐసీసీలో చోటు కల్పించడం లేదా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే అవకాశాలు ఉందన్నట్లు తెలుస్తుంది.