ఇంటర్నెట్డెస్క్ : చాలామంది కళాకారులు అద్భుతమైన బొమ్మల్ని గీస్తారు. అయితే ఇప్పటివరకు రంగులతో గీసిన బొమ్మల్ని చూసి ఉంటాం. మనం తినే మామిడికాయ పచ్చడితోనూ ఓ ఆర్టిస్ట్ అద్భుతంగా బొమ్మను గీసి తన ప్రతిభను చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆర్టిస్ట్ పేరు షింటు మౌర్య. ఈ వీడియోలో షింటు.. మామిడికాయ పచ్చడితో రోటీని తినేందుకు ప్రయత్నించి.. ఒక్క నిమిషం ఆగి.. ఆ పచ్చడిని ఓ గిన్నెలోకి తీసుకుని తెల్లని పేపర్పై దానితో ఓ బొమ్మను గీశాడు. ఆ బొమ్మ మొత్తం పూర్తయ్యాక చూస్తే ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ది. ఈ వీడియోను చూసిన ఎవరైనా సరే.. ఎంత బాగా గీశారో అని షింటుని మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ వీడియోను షింటు తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 4.2 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. ‘వావ్.. ఏం ప్రతిభ బ్రదర్ మీది? అంటూ కామెంట్స్ చేశారు.