ప్రజాశక్తి-నంద్యాల : పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో రహదారిపై చెత్త పేరుకుపోయింది. దాన్ని ఊడ్చేందుకు ప్రయత్నించిన నంద్యాల జిల్లా మున్సిపల్ కమిషనర్ను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. ఆయన్ను అడ్డుకుని.. చేతిలో ఉన్న చీపురును కార్మికులు లాక్కున్నారు. ఈ క్రమంలో వారి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. కార్మికులు ఎంతకీ తగ్గకపోవడంతో కమిషనర్ వెనుదిరిగారు.