తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి దంపతులు తిరుమల వేంకటేశ్వరుడిని శుక్రవారం దర్శించుకున్నారు. వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవలో పాల్గని స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ను జెఈవో శ్రీ వీరబ్రహ్మం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, విజివో శ్రీ గిరిధర్రావు, రిసెప్షన్ ఓఎస్డి శ్రీ రామకఅష్ణ, తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శేషవస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, విజివో శ్రీబాలిరెడ్డి, సూపరింటెండెంట్ శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.