పూణె : కొత్త ఏడాది నుంచి తన ఆపే ఐస్ా3 వీలర్ల ధరలను పెంచుతున్నట్లు పియాజియో తెలిపింది. జనవరి 1 నుంచి తన డీజిల్, సిఎన్జి, ఎల్పిజి, పెట్రోల్ వేరియంట్లలోని కార్గో, ప్యాసింజర్ వాహన ధరలను సవరిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఎక్స్షోరూం ధరల్లో రూ.6,000 వరకు పెంపు ఉంటుందని వెల్లడించింది.