న్యూఢిల్లీ : విప్రో జిఇ హెల్త్కేర్ వచ్చే ఐదేళ్లలో రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. తయారీ, ఆర్అండ్డి కోసం వ్యయం చేయనున్నామని ఆ సంస్థ సిఇఒ, ప్రెసిడెంట్ పీటర్ జె అర్డుని తెలిపారు. భారత్లో విస్తృతావకాశాలు ఉన్నాయని.. తాము అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇక్కడ తయారు చేసిన మెడికల్ పరికరాలను 15 దేశాలకు ఎగుమతి చేయనున్నామన్నారు. భారత వైద్య పరిశ్రమ వేగంగా అభివృద్థి చెందుతుందని విప్రో జిఇ హెల్త్కేర్ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ పేర్కొన్నారు.