కొనసాగిన ఎయిరిండియా ఉద్యోగుల ఆందోళన

May 9,2024 21:25 #Business

న్యూఢిల్లీ : ఎయిరిండియా ఉద్యోగుల అనుహ్యా సమ్మెతో ఆ సంస్థ విమానాల రద్దు కొనసాగుతోంది. ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంస్థకు చెందిన సిబ్బంది మూకుమ్మడిగా అనారోగ్య సెలవు తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం కూడా 85 విమాన సేవలను రద్దు చేశామని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది. ప్రయాణికులకు సాధ్యమైనంత వరకు అసౌకర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. కొన్ని రూట్లలో 283 విమానాలను నడిపించామన్నారు. కాగా.. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఒకసారి విమానాలు అందుబాటులో ఉన్నాయో.. లేదో తెలుసుకుని బయలుదేరాలని సూచించింది. పలువురు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది.

➡️