న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు గేమింగ్ అనుభవాన్ని మరింత చేరువ చేయడానికి ప్రముఖ గేమ్ డెవలపర్లను ఆన్ బోర్డింగ్ చేస్తున్నామని ఇండస్ యాప్స్టోర్ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ స్టోర్ అయిన ఇండస్ యాప్స్టోర్తో డ్రీమ్11, నజారా టెక్నాలజీస్, ఎ23, ఎంపిఎల్, కార్డ్ బాజీ, జంగిల్ రమ్మీ తదితర సంస్థలు తమతో ఒప్పందం కుదర్చుకున్నాయని పేర్కొంది. ఈ భాగస్వామ్యం లక్షలాది మంది వినియోగదారులకు గేమింగ్ అనుభవాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానుందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ఈ గేమింగ్ దిగ్గజాలను ఇండస్ యాప్స్టోర్ కుటుంబంలోకి ఆహ్వానించడం తమకెంతో సంతోషంగా ఉందని ఇండస్ యాప్స్టోర్ కో-ఫౌండర్ ఆకాశ్ డోంగ్రే పేర్కొన్నారు.