హైదరాబాద్ : కెల్జారు వోల్కానిక్ వాటర్లో మెజారిటీ వాటాను తీసుకుంటున్నట్లు క్లియర్ ప్రీమియం వాటర్ ప్రకటించింది. అగ్ని పర్వాతాల బుగ్గల నుంచి సేకరించిన విలక్షణ సహజ ఖనిజ జలాలకు కెల్జారు వోల్కానిక్ వాటర్ ప్రసిద్ది చెందింది. ఈ కొనుగోలు తమ సంస్థకు ముఖ్యమైన మైలురాయిని అని క్లియర్ ప్రీమియం పేర్కొంది. ఇది తమ ఉత్పత్తి పోర్ట్ఫోలియోను విస్తరించడానికి, బాటిల్డ్ వాటర్ పరిశ్రమలో ఆవిష్కరణకు మార్గదర్శకంగా నిలువనుందని తెలిపింది. దీంతో తమ మార్కెట్ ఉనికి పెరగనుందని క్లియర్ ప్రీమియం వాటర్ వ్యవస్థాపకుడు, సిఇఒ నయన్ షా పేర్కొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/03-clear-water.jpeg)