డ్రైన్ నిర్మాణానికీ భూమిపూజ చేస్తున్న ఎంఎల్ఎ చిట్టిబాబు
ప్రజాశక్తి-అయినవిల్లి
గ్రామాల అభివృద్ధికి సిఎం జగన్ విశేష కృషి చేస్తున్నారని ఎంఎల్ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. పోతుకుర్రు గ్రామం రామాలయం వీధిలో రూ.6 లక్షలతో డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన ఆదివారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సయ్యపురాజు సుబ్బలక్ష్మి, వైసిపి గ్రామ శాఖ అధ్యక్షుడు కమిడి వెంకటేశ్వరరావు, సచివాలయ కన్వీనర్, వాసంశెట్టి పుల్లం శెట్టి, మార్కెట్ కమిటి ఛైర్మన్ వేటుకూరు వెంకటరాజు, సొసైటీ ఛైర్మన్ చీలువురి నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.