ఫొటో : నాగబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న అళహరి సుధాకర్
నాగబాబును కలిసిన అళహరి
ప్రజాశక్తి-కావలి : మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నాగబాబును, తెనాలి పార్టీ కార్యాలయంలో పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ను మంగళవారం కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అళహరి సుధాకర్ కలిసి వారికి బోకే ఇచ్చి, కావలి నియోజకవర్గంలోజరుగుతున్న పరిణామాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడుగా తనను కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి సుమారు 5 సంవత్సరాల నుండి పార్టీ నిర్థేశించిన ప్రతీ కార్యక్రమం తన సొంత డబ్బులతో నడపుకుంటూ, రైల్వే రోడ్డులో అయితేనేమి, ఇప్పుడు తుమ్మలపెంట రోడ్డులో అతిపెద్ద పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభించినట్లు తెలియజేశారు.
![ఫొటో : నాగబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న అళహరి సుధాకర్](https://prajasakti.com/wp-content/uploads/2024/03/kvl-3.jpg)