ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ నియోజకవర్గం లో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైంది. జడ్పి చైర్మన్, వైసిపి అసెంబ్లీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి తో కలిసి శుక్రవారం రాంనగర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గడపగడపకు వైఎస్ఆర్ నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి తిరిగి రాష్ట్రంలో వైసిపిని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. పురపాలక పరిధిలోని సుమారు అన్ని వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, వైయస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ కష్ణారావు యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోలి మురళిరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు విష్ణు నాయక్, శివ, చలపతి, ధర్మయ్య, ఈశ్వరయ్య, శ్రీను యాదవ్, శ్రీను, విశ్వనాథరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.