మంగళగిరి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా బాలమురళీకృష్ణ

Mar 28,2024 22:39

నూతన కార్యవర్గం
ప్రజాశక్తి – మంగళగిరి :
మంగళగిరి బార్‌ అసోసియేషన్‌కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా శృంగారపాటి బాలమురళీకృష్ణ తన సమీప ప్రత్యర్థి వేమూరి రత్నప్రసాద్‌పై ఏడు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా కుడారి శేఖర్‌బాబు తన సమీప అభ్యర్థి తోట నరసింహారావుపై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శులుగా మాలపాటి సురేంద్రబాబు, రెంటపల్లి రాజేష్‌ ఇద్దరు పోటీ పడగా సమాన ఓట్లు రావడంతో చెరో ఆరు నెలలు పదవిలో కొనసాగున్నారు. సహాయ కార్యదర్శిగా డాక్టర్‌ తాతా సాంబశివరావు, ట్రెజరర్‌గా సూరబోయిన మురళీకృష్ణ, మహిళా సెక్రటరీగా వింజమూరి భారతీదేవి, లైబ్రరీ సెక్రటరీగా స్వరూపారాణి, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీగా గుర్రం రామారావు, 15 మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు వాకా రామగోపాల్‌గౌడ్‌, గుజ్జర్లపూడి జాన్‌బాబు, కె.బాబు అంబేద్కర్‌, ఎమ్‌డి సౌకత్‌ హుస్సేన్‌, జొన్నాదుల లెనిన్‌బాబు పాల్గొన్నారు.

➡️