పాన్ ఇండియా మూవీ ‘రామాయణ్’ షూటింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే సెట్లు వేసి షూటింగ్ నిర్వహిస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించంది. సాయిపల్లవి సీతగా, రణ్బీర్ కపూర్ రాముడి గెటప్లో ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గతేడాది రిలీజైన ‘ఆదిపురుష్’ మాత్రం ఘోరమైన ట్రోలింగ్కి గురైంది. తాజాగా తెరకెక్కిస్తున్న రామాయణ్ మూడు భాగాలుగా రానున్నట్టు సమాచారం.