మాట్లాడుతున్న చిరంజీవి అభిమానులు
మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్:భారతదేశంలో అత్యున్నత రెండో పురస్కారం అందడం మా అందరికీ పండుగ…ఊహ తెలియని రోజుల నుంచి ఆయన సేవా బావాలు ముందుకు తీసుకెళ్లిన చిరంజీవి యువత దీనిలో భాగస్వాములే.. యంగ్ ఇండియన్ ట్రస్ట్ వారు వారి సేవ గుణాన్ని ముందుకు తీసుకెళ్తూ కేన్సర్ తో బాధపడుతున్న పిల్లవాడికి రూ.25వేలు డొనేట్ చేయడం హర్షినీయం..పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవికి, కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా, చిరంజీవి యువత, కాపురాక్స్ యంగ్ ఇండియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కేక్ కటింగ్, బాణాసంచా పేల్చి, నెల్లూరు నర్తకి సెంటర్ లో ఘనంగా పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, కేన్సర్తో బాధపడుతున్న ఆరిగేళ్ల సూర్యతేజ అనే 3సంవత్సరాల బాబుకు నగదును అతని ట్రీట్మెంట్ కి గాను ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు యేటూరి రవికుమార్, పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
![మాట్లాడుతున్న చిరంజీవి అభిమానులు](https://prajasakti.com/wp-content/uploads/2024/01/chiranjeevi-3.jpg)