యర్రగొండపాలెంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం పట్టణంలోని 20వ బూత్‌ కన్వీనర్‌ పమిడిమర్రి కిశోర్‌ ఆధ్వర్యంలో మంగళవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ భవిష్యత్తు గ్యారెంటీ బాండ్లను నమోదు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు తోటా మహేష్‌ నాయుడు మాట్లాడుతూ మహిళలకు టీడీపీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పించారు. తల్లికి వందనం ద్వారా ఇంట్లో చదువుతున్న ప్రతి ఒక్కరికి ఏటా రూ.15 వేలు, ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి నెలా రూ.1500, అన్నదాతలకు ఏటా రూ.20 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ యువతకు యువగళం ద్వారా ఉద్యోగాల కల్పన, దీపం పథకం ద్వారా ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, చేదూరి కిశోర్‌, చలువాది శ్రీను, దేవకి బ్రహ్మానందరావు, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️