- రజక సంఘం జిల్లా చైర్మన్ సన్యాసిరావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రజకులపై జరుగుతున్న దాడులు నుంచి రక్షణ కోసం రక్షణ చట్టం చేయాలనీ ఎపి రజక సంఘం జిల్లా చైర్మన్ అప్పికొండ.సన్యాసిరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం పార్వతిపురం మన్యం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు తంగేటి భాస్కరరావు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం ఉమ్మడి జిల్లాల రజక సంఘం చైర్మన్గా అప్పికొండ సన్యాసిరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రజక జాతి అభివృద్ధి కొరకు నా సాయి శక్తుల ప్రయత్నిస్తానన్నారు. రజకులపైన దాడులు, దౌర్జన్యాలు, సాంఘిక బహిష్కరణలు చేస్తే వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ జంప.చిన్న, జిల్లా జాయింట్ సెక్రెటరీ చిట్టిబాబు, సింహాచలం, జిల్లా ఉపాధ్యక్షులు శీల తాతారావు, శ్రీను, చెల్లారావ్ తదితరులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.