ప్రవేట్ ఏటియం ఆఫ్ రేటర్స్ తో ఎమ్మార్వో సమీక్ష

ప్రజాశక్తి-విఅర్ పురం : ప్రవేట్ మినీ ఏటిఎం యాజమాన్యంతో గురువారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో వి అర్ పురం తహశీల్దార్ ఎస్ డి మౌలానా ఫాజిల్ గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోప్రవేట్ ఏటియం ఆఫ్రేటర్స్ అమాయక గిరిజన ప్రజలను మోసం చేసినట్లు తేలిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు రైతులు తమ అవసరాల కోసం క్రెడిట్ కార్డులుతో డబ్భులు విత్ డ్రా చేయడానికి వచ్చే సమయంలో, వారిని మోసం చేసి ఎక్కువ నగదు విత్ డ్రా చేసిఎవరిని మోసం చేయవద్దని అలా ఎవరైనా చేస్తే చర్యలు తప్పవని ప్రవేట్ ఆఫ్ రేటర్లను తహసిల్దార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో మినీ ఎటియం యాజమాన్యం అర్ ఐ మడకం రామకృష్ణ రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

➡️