ప్రజాశక్తి-వేటపాలెం: జరగనున్న ఎన్నికలలో చీరాల అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కుమారుడు గౌరీ అమర్ నాథ్ కోరారు. సోమవారం ఆయన మండల పరిధిలోని రామన్నపేట పంచాయతీ రావుపేటలో ఇంటింటికీ తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను, బీసీ డిక్లేషన్ ద్వారా లభించే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్యని, బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొగడదండ రవికుమార్, నాసిక వీరభద్రయ్య, ఒలుకుల కోటయ్య, పొగడదండ వెంకటేశ్వర్లు, కర్ణ శ్రీనివాస్, గుత్తి కుమార్, పత్తిపాటి శ్రీనివాసరావు, ఒలుకుల అయ్యప్ప, పింజల సుబ్రహ్మణ్యం, పింజల భాస్కర్, గుత్తి భాస్కర్, సబ్జా వెంకట సుబ్బారావు, పింజల రేణుకేశ్వరరావు, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.