అనంతపురం జిల్లా కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ
అనంతపురం కలెక్టరేట్ : సాధారణ ఎన్నికలు – 2024 కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం నాడు అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎస్పీ అమిత్ బర్దర్తో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రిజిస్టర్లు సజావుగా నమోదు చేయాలన్నారు. వెబ్ క్యాస్టింగ్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. చెక్ పోస్ట్ లైవ్ స్ట్రీమింగ్, ఎఫ్ఎస్టీ వాహనాల లైవ్ స్ట్రీమింగ్, జిపిఎఫ్ ద్వారా వెహికల్ మూమెంట్ ట్రాకింగ్ను నిరంతరం కొనసాగించాలన్నారు. రాత్రి సమయంలో లైవ్ స్ట్రీమింగ్నూ మెరుగ్గా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, నోడల్ అధికారి ఉమామహేశ్వరమ్మ, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.