అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలు ఏర్పాటు

Apr 5,2024 15:50 #Anantapuram District

గ్రాడ్యుయేషన్ డే లో పాంచజన్య శ్రీనివాసులు
ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలోని పాంచజన్య పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం పాఠశాలలో ప్రీ ప్రైమరీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా యూకేజి పూర్తి చేసుకుని, ప్రైమరీ విద్యకు నాంది పలుకుతున్న సందర్బంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు, కరస్పాండెంట్ నంద కుమార్ లు మార్కుల మెమోతో పాటు పట్టా, మిటాయి అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాలలో రాష్ట్ర, జాతీయ స్థాయికి అనుగుణంగా ప్రమాణాలను ఏర్పాటు చేసి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఉన్నత పాఠశాల విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. దీని కోసం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో అంతర్జాతీయ గుర్తింపు పొందిన వివిధ పాఠశాలలను పరిశీలన చేసి ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాల కన్న ఇంకా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందిస్తామన్నారు. విద్యకు పునాది ప్రాథమిక విద్య అన్నారు. ప్రాథమిక విద్య ధశలో మంచి క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించడంతో విద్యార్థి ఉన్నత విద్యకు పోయే సమయానికి మంచి క్రమశిక్షణతో ముందుకు పోవడానికి సాధ్యం అవుతుందన్నారు. అందుకోసమే ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నమన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం గాయత్రి, ఏ ఓ భాస్కర్, పాఠశాల సూపరిటెండెంట్ విజయంద్ర, ఎహెచ్ఎంలు శశికళ, సతీష్ కుమార్, అబ్దుల్ రజాక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గోన్నారు.

➡️