విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న అతిథులుసంబరంగా
ప్రజాశక్తి-అనంతపురం
అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల కళాశాల వార్షికోత్సవం, కళాశాల వార్షిక క్రీడా సంబరాలను ప్రిన్సిపాల్ ఎస్.వి.సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం సంబరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వర్శిటీ రెక్టార్ ఎం.విజరుకుమార్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెక్టార్ మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థులు వారికి నచ్చిన రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. మీరు కుడా భాగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సి.శశిధర్, వైస్ ప్రిన్సిపాల్ ఇ.అరుణకాంతి, స్టూడెంట్ యూనియన్ కోఆర్డినేటర్ బి.జోజిరెడ్డి, డైరెక్టర్లు జి.వి.సుబ్బారెడ్డి, ఎన్.విశాలి, ఆర్.కిరణ్మయి, ఆర్. పద్మసువర్ణ, ఏ.సురేష్ బాబు, సీనియర్ ఆచార్యులు పి.ఆర్.భానుమూర్తి, శంకర్ శేఖర్ రాజు, డి.విష్ణువర్ధన్, మాధవి, శివకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.