ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని పాత ఊరు కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న కార్పొరేషన్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులు యంత్రాలతో తరలించడానికి బుధవారం చేసిన ప్రయత్నాలు సిఐటియు నేతలు ఎర్రి స్వామి తిరుమలేశు తదితరులు అడ్డుకున్నారు. ఇన్స్పెక్టర్ రామాంజనేయులతో వాదులాటకు దిగారు. ఒకవైపు కార్మికుల సమ్మె చేస్తుంటే మరోవైపు సమ్మెను నిర్వీర్యం చేయటానికి అధికారులు ప్రయత్నించటం తగదని హెచ్చరించారు సమ్మెను విచిన్నం చేయడానికి అధికారులు, పోటీ కార్మికులను తెచ్చి, యంత్రాలతో తాడిపత్రి బస్టాండు నందు చెత్త తరలించడానికి ప్రయత్నం చేయటం ద్వారా ఏం సాధించాలని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. చెత్త ఎత్తిన ట్రాక్టర్లు ను అక్కడే డంపింగ్ చేయించారు. ఇప్పటికైనా అధికారులు, పోటీ కార్మికులను, దించకుండా, మున్సిపల్ కార్మికుల సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.