ప్రజాశక్తి -పెనుకొండ : నగర పంచాయతీ పారిశుద్ద్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదివారం పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ ముందు సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కనీస వేతనం రూ 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్, నాయకులు పెద్దన్న, సీఐటీయూ మండల కార్యదర్శి బాబావలి, కార్మికుల యూనియన్ నాయకులు పాల్గొన్నారు.